దేశ రాజధాని నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది సుమారు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది 70 సీట్లున్న అసెంబ్లీలో బిజెపికి 48 దక్కించుకోగా,, అధికార పార్టీ ఆప్ 22 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయి డక్ అవుట్ అయింది.
ఆప్ పార్టీ కీలక నేతలు కూడా ఓటమి చవిచూడటం విశేషం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ 4 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కేజ్రీవాల్పై విజయం సాధించారు. ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జంగ్పుర స్థానంలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఇక్కడ 600 ఓట్ల మెజారిటీ సాధించారు. షకుర్ బస్తీ నియోజకవర్గంలో సత్యేందర్ జైన్ బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి 19 వేల మెజారిటీ సాధించారు.
ఢిల్లీ సీఎం అతీశీ విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గంలో ఆమె బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై 900 ఓట్ల మెజారిటీ సాధించారు. మొదటి రౌండ్ నుంచి వెనుకబడ్డ అతీశీ అనూహ్యంగా చివరి రౌండులో గెలుపొందారు.
మొత్తానికి ఢిల్లీ పీఠం మీద గద్దెనెకాలన్న కమలనాథుల కోరిక ఇంత కాలానికి తీరింది