టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. 11వ రోజైన ఇవాళ ఆయన మంగసముద్రం విడిది కేంద్రంనుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన న్యాయవాదులు ఆయనను కలిశారు. తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డికి న్యాయవ్యవస్థపైనే నమ్మకం లేదని లోకేశ్ మండిపడ్డారు. న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులను తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల డెత్ క్లెయిమ్ను రూ. 10 లక్షలకు పెంచుతామన్నారు. చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని, న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ యువగళం యాత్ర – లోకేశ్ ను కలిసిన జిల్లాకు చెందిన న్యాయవాదులు
Share: