టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కు పేరును యువగళంగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక జెండాను సైతం పార్టీ రూపొందించింది. 2023 జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర చేస్తారు. ఏడాదిపాటు ప్రజలమధ్యే ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది.
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించింది పార్టీ. ఇక యాత్రలో యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయనున్నారు.