రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిన్న సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ పై గతంతో దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్లు, ఆపైన శిక్షపడితే అనర్హులవుతారు. 2019లో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దొంగలందరి ఇంటిపేరూ మోదీ అనేఉంటోందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీంతో గుజరాత్ కు చెందిన పూర్ణేష్ మోదీ అనే ఎమ్మెల్యే రాహుల్ మీద పరువునష్టం దావా వేశారు. 4 ఏళ్ల తరువాత గురువారం సూరత్ కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది.
https://twitter.com/ANI/status/1639187379629228033?s=20