శివసేన పేరుతో పాటు పార్టీ గుర్తైన విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లోని శివసేన కార్యాలయాన్ని ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ అధికారిక ప్రకటన వెలువరించింది. లోక్సభలోని 128వ నెంబర్ గదిని ఏక్నాథ్ షిండే క్యాంప్కు కేటాయించారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ బిల్డింగ్లోని పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం తమ అధీనంలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. అటు ఈసీ నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కేసును అత్యవసరంగా విచారించాలన్ని విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈనెల 22 మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామంది. అటు ఈసీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాక్రే…కమిషన్ రద్దుకు డిమాండ్ చేశారు.
https://twitter.com/ani_digital/status/1627941809459712003?s=20