తరగతి గదులకు తాళం వేయడంతో ఆరుబయటే పాఠాలు వింటున్న దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ విద్యార్థులది. మావల మండలం బట్టి సావర్గాం పంచాయతీ దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాల రెండు అద్దెగదుల్లో సాగుతోంది. 36మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. అయితే కొంతకాలంగా గదులకు అద్దె చెల్లించకపోవడంతో కొన్నిరోజుల క్రితం యజమాని తాళాలు వేసుకున్నాడు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు ఇప్పటికీ ఆరుబయటే పాఠాలు వింటున్నారు. తల్లిదండ్రులు కలెక్టర్ సహా , అధికారులను కలిసి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.