ఢిల్లీలో మరో వారంపాటు లాక్ డౌన్ పొడిగించారు. మే 3వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా వ్యాప్తి వేగమై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ రాత్రి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇది సోమవారంతో ముగియనుంది. కానీ, పాజిటివిటీ రేటు 36 శాతం ఉంటుండం, రోగులతో ఆస్పత్రులు నిండిపోవడం, ఆక్సిజన్కు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో మళ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.లాక్డౌన్ అమల్లో ఉన్న ఈ ఆరు రోజుల్లో కేసులు తగ్గలేదని,అయితే పాజిటివ్ రేటు తగ్గిందన్నారు. కాగా, ఆక్సిజన్ లభ్యత, వినియోగాన్ని పరిశీలించేందుకు.. ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది.