డిల్లీ, మహారాష్ట్ర ఇక ఇప్పుడు కర్నాటక… కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం. రాష్ట్రంలో 24 గంటల్లో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజధాని బెంగళూరులోనే 20వేలకు పైగా కేసులు వచ్చాయి. దీంతో లాక్ డౌన్ అమలుకే మొగ్గింది ప్రభుత్వం. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తాజా పరిస్థితులపై యడ్యూరప్ప సమీక్ష నిర్వహించారు. రేపటినుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. నిత్యావసరాలకు మాత్రం ఉదయం 6 గంటలనుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉంటుంది. లాక్ డౌన్ ఉన్నా మే 1నుంచి 18 ఏళ్లు నిండినవారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని యడ్యూరప్ప తెలిపారు.