లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కారు. వైరస్ వ్యాధి నిరోధించేందుకు మరో రెండు వారాలు అంటే జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ లాక్డౌన్ కొనసాగుతుంది.. వారాంతంలో పూర్తి లాక్డౌన్ ఉంటుందని, ప్రతి శుక్రవావారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ పూర్తి లాక్డౌన్ అమలులో ఉంటుందని సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం ఈనెల 5న ప్రకటించిన రెండు వారాల లాక్డౌన్ ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున రాష్ట్ర ఆరోగ్య నిపుణులు, జిల్లా అధికారులతో సంప్రదించి లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.
మూడు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టి, అనుమానాస్పద కేసుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సీఎం అన్నారు.