తెలంగాణలో పదిరోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రేపటినుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. అయితే ఉదయం 6 గంటనుంచి 10 గంటల వరకు మాత్రం అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నారు. హైకోర్టు హెచ్చరికలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ ఇంకా పలు కీలక అంశాలపై చర్చించింది.