వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలికుంట్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలోని టైమ్ మిషన్ ను పోలినట్టు ఉండడంతో స్థానికులు దాన్ని విచిత్రంగా, ఆసక్తిగా చూశారు. పంటపొలాల్లో పడిన దాన్ని చూసి కొందరు భయపడ్డారు కూడా. అయితే అది రీసెర్చ్ హీలియం బెలూన్ అని అధికారులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వాతావరణంలో మార్పుల అధ్యయనం కోసం బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దాన్ని పంపినట్టు తెలిసింది.
https://twitter.com/Gnarsin85245826/status/1600381086823256064?s=20&t=kc3Tu2evJLtzICqEs2xM0w