తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. 50కి పైగా ప్రాంతాల్లో 35 టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి.తెల్లవారుజామున మూడు ఐటీ బృందాలు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన్స్ట్రక్షన్కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతోపాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు కొనసాగుతున్నాయి.ఇంకా పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా ఫైనాన్సియర్స్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి.