ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర రాజు, ఆర్మీ స్టాఫ్ తదుపరి వైస్ చీఫ్గా నియమితులయ్యారు.ప్రస్తుత వైస్ చీఫ్ గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే తదుపరి ఆర్మీ చీఫ్గా ప్రస్తుత జనరల్ మనోజ్ నరవానే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ స్థానంలో రాజు కొనసాగనున్నారు. ఆయన రేపు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఒక 3 స్టార్ అధికారి ఆర్మీ కమాండర్ గా పనిచేయకుండా నేరుగా వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం ఆర్మీలో చాల అరుదైన సందర్భం.ఆర్మీలో చాలా కాలం పాటు కమాండర్ గా పని చేసిన వారిని మాత్రమే వైస్ చీఫ్ గా నియమిస్తారు. అయితే లెఫ్టినెంట్ జనరల్ రాజు మొదట వైస్ చీఫ్గా వ్యవహరిస్తారని, ఈ ఏడాది చివర్లో ఆర్మీ కమాండర్గా కొనసాగనున్నారు.
కర్ణాటకకు చెందిన బి ఎస్ రాజు బీజాపూర్ సైనిక పాఠశాల, నేషనల్ డిఫెన్స్ అకాడమీల్లో విద్యనభ్యసించారు. 1984 డిసెంబరు 15న జాట్ రెజిమెంట్ లో చేరారు. జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ పరాక్రమ్, ఉరి బ్రిగేడ్, నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద వ్యతిరేఖ దళం, కశ్మీర్ లోయలోని చినార్ కోర్ కు నాయకత్వం వహించారు. దేశంలోని అన్ని సైనిక కోర్సుల తోపాటు ఇంగ్లాండ్ లోని రాయల్ కాలేజీ అఫ్ డిఫెన్సె స్టడీస్ లో ఎన్ డీసీ చేశారు. అమెరికా మాంటెరీలోని నావెల్ పోస్టుగ్రాడ్యుయేట్ స్కూల్ నుంచి కౌంటర్ టెర్రరిజంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. సైన్యంలో తన సేవలకు గానూ ఉత్తమ్ యుధ్ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ సొంతం చేసుకున్నారు.