పేదలపేరిట విరాళాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్న రాణా ఆయూబ్ కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉదారవాదులు, కుహనా లౌకికశక్తులు, సంస్థలు బయల్దేరాయి. ఓ కాలమిస్టును దేశం వేధిస్తోందంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టింది UNCHR . అతివాద హిందూ జాతీయ వాద గ్రూపులు ఆమెపై దాడులు చేస్తున్నారని అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పెషల్ రిపోర్టర్స్ అయిన ఐరీన్ ఖాన్, మేరీ లాలర్ ల నివేదికతోనే ఐరాస హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇలా స్పందించింది.
దేశంలోని ముస్లిం మైనారిటీల తరపున గళమెత్తుతూ వారి సమస్యలపై పోరాడుతున్నందునే ఆమెను టార్గెట్ చేశారని దాడి ఉధృతం చేశారనీ వారు రిపోర్టు చేశారు. అంతేకాదు ఇటీవల కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారంలో మద్దతుగా నిలివడం కూడా కారణమట. ఆమెపై అతివాద హిందువులు దాడి చేస్తుంటే ప్రభుత్వం ఖండించలేకపోగా.. ఆమెనే వేధింపులకు గురిచేసిందని.. ఆమె భద్రతనే ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు ఆ ఇద్దరు.
ఆమె మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తు మొదలుపెట్టిందని ప్రస్తావిస్తూ.. ఆమె పరువుకు భంగం కలిగించేలా సంస్థలు, వ్యవస్థలు పాటుపడ్డాయని…అదే సమయంలో రైట్ వింగ్ సోషల్మీడియా గ్రూపులు మరింత రెచ్చిపోయాయన్నారు ఈ ఇద్దరు స్పెషల్ రిపోర్టర్లు. ఆయూబ్ కు వస్తున్న బెదిరింపులను అడ్డుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందని, ఆమెకు అవసరమైన భద్రతను సైతం కల్పించలేదని నివేదికలో పేర్కొన్నారు ఐరీన్ ఖాన్, మేరీ లాలర్.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు రిపోర్ట్ చేసిన ఈ ఇద్దరూ ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ లు మాత్రమే. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐ.రా.స కు చెందిన ఓ విభాగం. ఈ ఇద్దరు అందులో సిబ్బంది కాదు. వీరిచ్చే రిపోర్ట్ లేదా చెప్పే విషయాలు ఐరాస అధికారిక ప్రకటనగా చెప్పకూడదు. అయితే వీరి ప్రకటనపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాణా ఆయూబ్ విషయంలో చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని .. భారతదేశంలో చట్టబద్దమైన పాలన ఉందని..చట్టానికి ఎవరూ అతీతం కాదని స్పష్టం చేసింది. స్పెషల్ రిపోర్టర్లు కచ్చితమైన, సత్యమైన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి తప్పుడు వార్తలు జనాల్లోకి వదలడం సరికాదని, తమ దేశ ప్రతిష్టను దిగజార్చే తీరును మార్చుకోవాలని హితవు పలికింది భారత్.
క్రౌంట్ ఫండింగ్ ప్లాట్ ఫాం కెట్టూ ద్వారా సేవపేరుతో కోట్లరూపాయలు వసూలు చేసి వాటిని సొంతానికి వాడుకున్నారు రాణా. దానికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ రిలీఫ్ వర్క్ పేరుతో ఆమె ప్రపంచ దేశాల నుంచి విరాళాలు సేకరించి చట్ట విరుద్ధంగా తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో సేవ్ చేసుకున్నారు. ఏడాదిన్నరైనా వాటిని తీయలేదు, ఎలాంటి చారిటీ చేయలేదనీ వివరణ ఇచ్చింది.
ఇక రాణా ఆయూబ్ కు మద్దతుగా ప్రకటన చేసిన ఇద్దరిలో ఐరీన్ ఖాన్ బంగ్లాదేశ్ వాసి. అంతర్జాతీయ వేదికలపై తరచూ భారత్ ను విమర్శిస్తుంటారు. భారత అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. UNCHRలో ఐరీన్ ఖాన్ అధికారిక ప్రొఫైల్ ప్రకారం, ఆమె 2001 నుండి 2009 వరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ-జనరల్గా ఉన్నారు. సంస్థ నుంచి 700,000 అమెరికా డాలర్లు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో సంస్థ ఉద్వాసన పలికింది. మాజీ గ్వాంటనామో ఖైదీ అయిన మోజామ్ బెగ్కు మద్దతు ఇవ్వడం, ఇస్లామిస్ట్ గ్రూపులతో సంబంధాలు బయటకు వచ్చాయి.
ఇక ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థ ఇది. FCRA లైసెన్స్లను భారత్ జారీ చేయనప్పటికీ…విదేశాల నుంచి నిధులు సేకరిస్తూనే ఉంది.
2020లో భారత ప్రభుత్వ కఠిన వైఖరితో ఈడీ సంస్థ ఖాతాలు స్తంభింపచేయడంతో అప్పుడు భారత్ కు విరాళాలు నిలిపేసింది.
Pls raise it officially to take back this ultra biased 'opinion' piece by so-called UN Expert (former Amnesty head) Irene Khan that said the money laundering investigation by @dir_ed is baseless.
ED must take it up seperately through their protocols. pic.twitter.com/t3gz2rxgq6— The Hawk Eye (@thehawkeyex) February 21, 2022
మరొక ట్విట్టర్ వినియోగదారు సాగరిక పేర్కొన్నట్లు ఆమె ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లా ఆర్గనైజేషన్ (IDLO) డైరెక్టర్ జనరల్గా కూడా ఉన్నారు. UNలోని ఆమె ప్రొఫైల్ ద్వారా 2012 నుంచి 2019 వరకు IDLO లో ఉంది. IDLO కి చైనా సహాయసహకారాలున్నాయి. IDLO , చైనా “వన్ బెల్ట్ వన్ రోడ్”పై ఒక మెమోరాండంపై సంతకం చేశాయి.
ఇక ఐరాసలో ఐరీన్ నియామకం వెనక డ్రాగన్ కంట్రీ ఉంది. 2020లో చైనా నేతృత్వంలోని ప్యానెల్ ఆమెను వాక్ స్వేచ్ఛపై ప్రపంచ మానిటర్ గా నియమించింది. అంటే ఆ కమ్యూనిస్టు దేశంతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె నియామకంపై మానవ హక్కుల కార్యకర్త, అంతర్జాతీయ న్యాయవాది హెల్లెల్ సి న్యూయర్ అభ్యంతరాలు తెలిపారు. “నిరంకుశపాలనను సమర్థిస్తూ మౌనంవహిస్తూ ప్రజల గొంతును అణచివేస్తున్నారు. ఇంటర్నెట్ కంటెంట్ ను నిరోధించేందుకు గ్రేట్ ఫైర్ వాల్ నిర్వహించే ప్రక్రియకు అనుమతిస్తున్నారు. భావప్రకటనాస్వేచ్ఛపై యూఎన్ ప్రతినిధిగా ఐరీన్ ను ఎంపిక చేయడం హాస్యాస్పదం. ఆమెకు రోజూ చైనా విధానాలను సమర్థించడమే పని. కానీ చైనా చిత్రహింసలకు గురవుతున్న ఉయ్ఘర్ ముస్లింల గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు’ న్యూయర్ ట్వీట్ చేశారు.
In case the article itself isn't accessible.
Co-author Mary Lawlor was previously fundraise at Amnesty International.
Co-author Irene Khan is Dir-Gen of the International Development Law Organization (IDLO) and was Sec-Gen of Amnesty International.+ https://t.co/q0fL9k0BzG pic.twitter.com/e80PV77ac3
— Sagorika (@sagorika_s) February 21, 2022
ఇక మేరీ లాలర్. ఈమేం తక్కువ తినలేదు. భారత్ లోని అర్బన్ నక్సలైట్లకు మద్దతునివ్వడం, దేశంపై తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఆమెకు మరో పనిలేదు. ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల రక్షకుల పరిస్థితిపై ప్రత్యేక ప్రతినిధి. రాణా ఆయూబ్ ను నిస్సిగ్గుగా సమర్థిస్తూ భారత ప్రభుత్వంపై బురద చల్లుతున్న ఈమెకు కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తో గాఢమైన బంధమే ఉంది. 1988 నుంచి2000 వరకు సంస్థ ఐరిష్ విభాగానికి డైరెక్టర్గా ఉన్నారు.
వయోభారం వల్ల అనారోగ్యంతో 2021లో అనారోగ్యంతో మరణించిన భీమాకొరేగావ్ హింసాకాండ నిందితుడు స్టాన్ స్వామి అతని అరెస్టును నిరసిస్తూ ప్రపంచ వేదికలపై భారత్ ను లక్ష్యంగా చేసుకుందీమె. ఆయన మరణం భారత దేశ మానవహక్కుల చరిత్రలో ఎప్పటికీ మచ్చగా మిగిలిపోతుందని వ్యాఖ్యానిస్తూ బురదచల్లింది.స్వామి విషయంలో దేశదేశాలు తిరుగుతూ వ్యతిరేక ప్రచారం చేసింది. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కోర్టుకు అందించిన ఆధారాల గురించి ఆమె ప్రస్తావించదు. అంతే కాదు ఆయనకు సరైన వైద్యసహాయం అందించలేదని ప్రచారం చేసింది. కానీ ఆయనకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అదించిందన్న సంగతి ఈ దేశంలో అందరికీ తెలుసు.
BREAKING: 🇨🇳 China was Chair of the U.N. Human Rights Council vetting process that picked Amnesty International's former chief Irene Khan to be the next world monitor on free speech—to be ratified this afternoon—and it turns out she's weirdly close with China's government. pic.twitter.com/zquD92e0bo
— Hillel Neuer (@HillelNeuer) July 17, 2020
కశ్మీరీ వేర్పాటువాది ఖుర్రమ్ పర్వేజ్ అరెస్టునూ ఆమె ఖండించింది. 2021లో అతన్ని NIA అరెస్టు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకోసం ఫండింగ్ చేస్తూ, కశ్మీర్లో యువతను వేర్పాటువాదం, ఉగ్రవాదంవైపు మళ్లిస్తున్నారని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఫిబ్రవరి 22 న అతనితోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఇక రహస్య పత్రాలను ఉగ్రసంస్థ లష్కరేతోయిబాకు అందజేసిన మాజీ ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరు స్పెషల్ రిపోర్టర్స్ రాణా ఆయూబ్ మీద దర్యాప్తును వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వానికి కూడా లేఖరాశారు. ఆమెకు సరైన భద్రత కల్పించడం లేదని అందులో ఆరోపించారు కూడా. ఇలా తప్పుచేసి దొరికిపోయిన రాణాకు మద్దతుగా ప్రపంచదేశాలనుంచి ఉదారవాదులు ఒక్కొక్కరుగా బయటకువస్తున్నారన్నమాట.
For a human rights activist, it's weird that Irene Khan's Twitter account only has PRAISE for China. This is a regime that commits horrific and widespread violations of human rights affecting many hundreds of millions of people. #STOPUigurMuslimGenocidehttps://t.co/w4TPQpStLx pic.twitter.com/SQAFIKOQpu
— Hillel Neuer (@HillelNeuer) July 17, 2020
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)