లావణ్య, హీరాలాల్, దినేశ్ యాదవ్ ఈ పేర్లు ఎక్కడో విన్న గుర్తు కూడా లేదు కదా. కొద్ది రోజుల వ్యవధిలో ఇస్లామిస్టులు, క్రైస్తవ మాఫియా అఘాయిత్యాలకు బలైన హిందువులు వీళ్లు. కేవలం హిందువులు కావడం వల్లే ఎవరూ వీళ్ల హత్యల్ని పట్టించుకోలేదు. సోకాల్డ్ సెక్యులరిస్టులు, ఉదారవాదులు, హక్కుల ఉద్యమకారులు వీళ్ల విషయంలో నోరెత్తడం లేదు. దేశంలో ఏ మూలనైనా మైనార్టీలకు ఏదైనా జరిగితే రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, క్యాండిల్ ర్యాలీలు చేసే హక్కులకారుల నోళ్లు పూర్తిగా మూగబోయాయి. మీడియాకు కూడా లావణ్య, హీరాలాల్, దినేశ్ యాదవ్ లు పట్టలేదు.
అందుకు ఒకే ఒక కారణం వాళ్లు హిందువులు కావడమే. మైనార్టీల చేతిలో అఘాయిత్యాలకు గురై మరణించిన వీళ్లలో ఓ మహిళ, ఓ దళిత యువకుడు ఉన్నా కూడా హక్కులకారులు ఇదేంటి అని ప్రశ్నించలేదు. కనీసం అయ్యో అని కనికరం చూపలేదు. అంటే ఈ దేశంలో హిందువు అనేవాడు బాధితుడైతే ఎవరికీ పట్టదని అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన ఈ మూడు ఉదంతాలే రుజువు చేస్తున్నాయి.
క్రైస్తవ మాఫియా చిత్రహింసలు తాళలేక బలవంతంగా ఉసురు తీసుకుంది పన్నెండోతరగతి చదువుతున్న తమిళనాడు తంజావూరుకు చెందిన బాలిక లావణ్య. ఇక దేశ రాజధాని నడిబొడ్డులో ముస్లిం గూండాల చేతిలో హత్యకు గురయ్యాడు హీరాలాల్.2020 నాటి ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లల్లో అమాయకుడైన దినేశ్ యాదవ్ ను హిందువు కనుకే ఇరికించి శిక్షపడేలా చేశారు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలో జరిగినవి ఈ మూడు ఘటనలు. మానవహక్కుల కార్యకర్తలు, సంఘాలు ఎవరూ వీరి గురించి మాట్లాడలేదు. మీడియా కూడా ఎక్కడా వీరికి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించలేదు. దీన్ని బట్టి హిందుస్థాన్లో హిందువుల దయనీయపరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడు తంజావూరులోని తిరుకట్టుపలిలో ప్లస్ టూ చదువుతున్న లావణ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పురుగుల మందు తాగిన లావణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… తన చావుకు పాఠశాల యాజమాన్యమే కారణమని… తనను మతం మారమని ఒత్తిడి తెచ్చారని…ఒప్పుకోనందుకు చిత్రవధ చేశారని మరణవాంగ్మూలం ఇచ్చింది.
హిందువు అయిన లావణ్యను మతంమారాల్సిందిగా మిషనరీ స్కూల్ యాజమాన్యం పట్టుబట్టింది. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఇబ్బందులు పెట్టింది. దీంతో మనస్తాపం చెందిన లావణ్య స్కూల్లోనే పురుగులమందు తాగింది. క్రిస్మస్ కు అందరికీ సెలవులిచ్చిన యాజమాన్యం…తాను మతం మారనన్నందుకు పొంగల్ వేడుక కోసం పెట్టుకున్న సెలవు దరఖాస్తును రద్దు చేసిందని… సెలవుల్లో ఇంటికి వెళ్లాల్సిన తనతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారని…వంటచేయించారని, గిన్నెలు కడిగించారని ఏడుస్తూ చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. అంత స్పష్టమైన ఆధారం ఉన్నా ఎవరూ ఆమెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు.
తమిళనాడులో మిషనరీ పాఠశాలలో జరుగుతున్న ఆగడాలపై అసలైతే పెద్దదుమారాన్ని రేగాలి. మిషనరీ పాఠశాలల్లో మతమార్పిళ్లు అరికట్టడానికి చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తాలి. కానీ అలాంటివేం అక్కడ జరగలేదు. కానీ బాధితులు మైనారిటీ అయినప్పుడు మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదారవాదులంతా పుట్టల్లోంచి బయటకువస్తారు. అంతటితో ఆగక అందుకు కారణం ఆర్ఎస్ఎస్ వాళ్లు, బీజేపీ వాళ్లేనంటూ వెంటనే ముద్రవేసి రోడ్డెక్కుతారు. శవరాజకీయాలు చేస్తారు. అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎందరో కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో హత్యకు గురైతే ఎవరూ అయ్యో అనలేదు, అనబోరు.
జనవరి 17, 2020లో మరో దురదృష్టకరమైన ఘటన జరిగింది. హిందూ దళితుడైన 38 ఏళ్ల హీరాలాల్ ను ఢిల్లీ నడిబొడ్డున హత్య చేస్తే కూడా ఎవరికీ పట్టలేదు. గుజరాత్ కు చెందిన హీరాలాల్ అనే వ్యక్తిని ఇర్ఫాన్ సిద్దిఖీ, అతని సోదరుడు సాను దారుణంగా హత్య చేశారు. హీరాలాల్ సోదరిపై అత్యాచారం చేసిన నేరానికి జైలుకెళ్లిన సిద్ధిఖీ…అంతకువారం రోజుల ముందే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య తరువాత అతని ఇల్లు అమ్మకానికి పెట్టారు. కానీ ఆ ఇంటి ముందు అన్ సేల్ పోస్టర్ దర్శనమిచ్చింది. ఆప్ ఎమ్మెల్యే ముఖేష్ ఆహ్లావత్ కు అత్యంత సన్నిహితుడు హంతకుడైన ఇర్ఫాన్.
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతామనే వీరులకూ దళితుడైన హీరాలాల్ హత్య కనిపించలేదు. దేశ రాజధానిలో జరిగిన ఈ హత్య విషయం మీడియాకు కూడా పట్టలేదు. కారణం ఒకటే అది అతను హిందువుఅవడం. దేశంలో లవ్ జిహాద్లు, బలవంతపు మతమార్పిళ్లకు ఎంతోమంది బలవుతున్నారు. అవేవీ బయటకు రావడం లేదు. వామపక్షమేధావులు పట్టించుకోరు, మీడియాకు కనిపించినా పట్టించుకోరు. హిందుత్వపై, హిందువులపై కుట్రప్రకారమే ఈ చర్యలు జరుగుతున్నాయి. కుట్రపూరిత సిద్ధాంతాన్ని మాత్రం వాళ్లు అమలు చేస్తూ హిందువులను మాత్రమే తప్పుబడుతుంటారు. విశ్వవిద్యాలయాలు వేదిగ్గా జైమీమ్, జైభీమ్ నినాదాలిచ్చే మేధావులు ఒక్కరూ దళితుడైన హీరాలాల్ హత్య గురించి అస్సలు స్పందించలేదు. ఆ స్థానంలో మైనార్టీ ఎవరైనా ఉంటే మాత్రం మనువాదం, బ్రాహ్మనిజం అంటూ రచ్చ చేస్తుంటారు. చేసిన సందర్భాల్నీ మనం చూశాం.
ఇక దినేశ్ యాదవ్. ఢిల్లీ అల్లర్ల కేసులో సాక్ష్యాధారాల కన్నా అతను హిందువు అనే గుర్తింపే దోషిని చేసింది. 2020 నాటి డిల్లీ అల్లర్ల కేసులో దోషిగా తేలిన మొదటి వ్యక్తి దినేష్ యాదవ్. అల్లర్ల తరువాత జూన్ 8 2020లో అతన్ని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 6, 2021న అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ దినేష్ ను దోషిగా నిర్దారించారు.
2020 ఫిబ్రవరి నాటి అల్లర్లను అసలైతే హిందూ వ్యతిరేక అల్లర్లుగా చెప్పవచ్చు. సీసీఏ నిరసనల్లో భాగంగా ఇరు వర్గాల మధ్య చెలరేగిన చిన్న గొడవు ఘర్షణలకు దారితీసింది. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చిన ముస్లింల గుంపు హిందువుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశారు. రాళ్లదాడి చేశారు. యాసిడ్ సీసాలు విసిరారు. అల్లర్లలో 53 మంది పౌరులు మరణించగా, 700 మంది గాయపడ్డారు.
నాటి అల్లర్లలో యాదవ్ పాల్గొన్నాడని… ఫిబ్రవరి 25న రాత్రి మనోరి అనే 73 ఏళ్ల వృద్ధురాలి ఇంటిని ధ్వంసం చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది. 150 నుంచి 200 వందలమంది ఆమె ఇంటిపై దాడి చేశారని చెబుతున్నారు. దాడి సమయంలో ఆమె ఇంట్లో లేదు. వస్తువులు ధ్వంసమయ్యాయని, గేదెను అపహరించారని ఆమె ఫిర్యాదు చేసింది.
దీంతో పలు సెక్షన్ల కింద అతన్ని దోషిగా నిర్దోషించింది కోర్టు. నాటి అల్లర్లలో ఎందరో హిందువులు బలయ్యారు. హిందువుల ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ ముస్లిం మహిళ ఇంటికి నిప్పుపెట్టాడంటూ ఒక్క దినేష్ యాదవ్ కు మాత్రమే కోర్టు శిక్షవేసింది. నిరుపేద కుటుంబం దినేష్ ది. రెండు గదుల ఇంట్లో వారి ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. గతంలో ఎలాంటి అల్లర్లలోనూ దినేశ్ పాల్గొనలేదని స్థానికులు చెబుతున్నారు. చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన తల్లి..దినేశ్ తో పాటు అతని సోదరుని చదివిస్తూ పెంచి పెద్ద చేసింది. 12 వేల జరిమానా కూడా కట్టలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది.
పైన పేర్కొన్న ఇటీవలి కాలంలో జరిగిన ఈ మూడు ఉదంతాలు భారత్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి. ఇవి పట్టించుకోని వామపక్ష మేధావులు, లౌకిక వాదులు, మీడియా …
హరిద్వార్ సంసద్ తో ఒకరు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం వివాదాస్పదం చేస్తున్నారు. హీరాలాల్ హత్య గురించి, లావణ్య ఆత్మహత్య గురించి మాట్లాడని లిబరల్స్, హక్కుల ఉద్యమకారులు, ధర్మసంసద్ సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాయి.
అంటే వారికి కేవలం మైనారిటీల హక్కులు మాత్రమే కావాలి. రాజకీయ పార్టీలూ అంతే. హిందువుల్లో అనైక్యత వారికి అవకాశమైపోయింది. అందుకే మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నారు నాయకులు. హిందువులకు ఇలా అన్ని విధాలా అన్యాయం జరుగుతుంటే ఉదారవాదులు తీరు, మీడియా ఉదాసీనత, చట్టంలో లొసుగుల వల్ల వారు బాధితులుగానే మిగిలిపోతున్నారు.