పశ్చిమబెంగాల్ లో తృణమూల్ హత్యా రాజకీయాలపై 2093 మంది మహిళా న్యాయవాదులు భారత ప్రదాన న్యాయమూర్తికి లేఖరాశారు.లేఖలో పలు అంశాల్ని వారు ప్రస్తావించారు…రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏకపక్షంగా సాగిన హింస…మహిళలపై అత్యాచారాల్నీ గుర్తుచేశారు.
బాధితులైన మహిళలు పోలీసుస్టేషన్ కు వెళ్తే అక్కడా న్యాయం జరగడంలేదని…అసలు పోలీసులు కేసులే తీసుకోవడం లేదని ఉదాహరణల్నీ లేఖలో పేర్కొన్నారు..
సుప్రీంకోర్టు జోక్యం తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరారు..ఇతరరాష్ట్రాలకుచెందిన ఎవరినైనా నోడల్ అధికారిగా నియమించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటుచేయాలనీ సుప్రీంకు విజ్ఞప్తి చేశారు.. అల్లర్లకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని మహిళా న్యాయవాదులు కోరారు
ఇప్పటికే రాష్ట్రపతికి 150 మందికి పైగా రిటైర్డ్ జడ్జీలు, బ్యూరోక్రాట్లు, రాయబారుల లేఖరాసిన సంగతి తెలిసిందే..