ఈ ఏడాది పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 ని నిర్వహించనున్నారు. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతిఏటా పరీక్షలకు ముందు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. 2018 లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ సారి కార్యక్రమం గురించి మోదీ ట్వీట్ చేశారు. పరీక్షా పే చర్చ ప్రోగ్రామ్ అనేది పరీక్షలతో పాటు జీవితంలోని వివిధ కోణాల గురించి మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుందని అన్నారు. నేరుగా భారత ప్రధానితో సంభాషించే, సందేహాలు అడిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం నిర్వహిస్తోంది. పరీక్షా పే చర్చా మొదటి మూడు ఎడిషన్స్ న్యూ ఢిల్లీలో ఇంటరాక్టివ్ టౌన్-హాల్ ఫార్మాట్లో జరిగాయి. నాలుగో ఎడిషన్ గత ఏడాది ఏప్రిల్ 7న ఆన్లైన్లో జరిగింది. ఈసందర్భంగా మోదీ ‘పరీక్ష పే చర్చ అనే ఇంటరాక్టివ్ సెషన్.. పరీక్షలు, చదువులు, జీవితం, మరెన్నో విభిన్న అంశాల గురించి మాట్లాడే అవకాశాన్ని మనందరికీ అందిస్తుంది..’ అని ట్వీట్లో పేర్కొన్నారు. పరీక్షా పే చర్చ 2022 ఎడిషన్ ఏప్రిల్ 1న న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరగనుంది. ‘ఒత్తిడి లేని పరీక్షల గురించి మరోసారి మాట్లాడుకుందాం. డైనమిక్ ఎగ్జామ్వారియర్స్, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏప్రిల్ 1వ తేదీన ఈ ఏడాది పరీక్షా పే చర్చలో పాల్గొనండి’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. అందుకు ఓ వీడియోనూ జత చేశారు. అందులో మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ వారడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. 2 నిమిషాల 9 సెకన్ల వీడియోలో ప్రధాని విద్యార్థులను మోటివేట్ చేస్తూ.. ‘ఈ పరీక్షలు జీవితానికి ముగింపు కాదు. మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగల సామర్థ్యం ఉందని చెప్పడానికి ఒక రుజువు.’ అని చెప్పారు.
https://twitter.com/narendramodi/status/1508102958273433605?s=20&t=QJ8LTxGunzaGINVAFHH6Nw
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)