ఢిల్లీలో జరుగుతున్న హ్యాండ్ లూమ్ ఎక్స్ పో సందడి చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎక్స్ పోలో కొన్ని చీరల్ని కొనుగోలు చేసినట్టు ఆమె సోషల్మీడియాలో షేర్ చేశారు. చీరలను పరిశీలిస్తున్న వీడియోనూ షేర్ చేశారు. ఖాదీని ప్రమోట్ చేయాలని స్థానికంగా తయారైన చేనేత వస్త్రాల్ని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని అరుణ కోరారు.