కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదాం, మరో మహోద్యమానికి సిద్దం అవుదామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పిలుపునిచ్చారు.6వరోజు ప్రజాసంగ్రామ యాత్ర లో భాగంగా నిర్మల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ రాంపూర్ శివారు నుంచి ప్రారంభమై గుండంపల్లి క్రాస్, దిలావల్పూర్ మీదుగా ఆయన యాత్ర సాగింది. ఈసందర్భంగా … కేసీఆర్ పై టీఆర్ఎస్పైమండిపడిన సంజయ్…లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన బిడ్డ కవితను కాపాడుకునేందుకు, కేసీఆర్.. మహిళ అనే సెంటిమెంటును రగిలిస్తున్నాడన్నారు.