తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.కేంద్రం అన్నిరంగాల్లో విఫలమై అంతటా మంటలు పెడుతోందని మండిపడ్డారు. నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం నాడు ఒక్కడినే కదిలితే వెంట వచ్చారని..నేడు విపక్షాలను నిర్వీర్వం చేయాలనుకుంటున్న జాతీయపార్టీ బీజేపీ కుట్రల్ని తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్ సహా ఈస్థాయిలో సంక్షేమ పథకాలు తెలంగాణలో ఎక్కడా లేవని కేసీఆర్ అన్నారు. బ్యాంకులను, రైల్వే, విమానాలను, పోర్టులను అమ్మారని…రైతుల దగ్గర ఉన్న భూమి మాత్రమే మిగిలిందని… మోటార్లకు మీటర్లు పెట్టి వ్యవసాయం ఆపేస్తే దాన్నీ లాక్కోవాలనుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం తాను పోరాటం మొదలుపెట్టానని కలిసి రావాలని సీఎం కోరారు.