స్వాతంత్ర్య దినోత్సవాల వేళ వచ్చే నెల ఆగస్ట్ 13 నుంచి 15 మధ్య భారతీయులంతా తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మువ్వన్నెల జెండాతో మనకున్న అనుబంధాన్ని ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది. 1947, జూలై 22న మనం జాతీయ జెండాను స్వీకరించాం. విదేశీయుల పాలనలో …జాతీయ పతాకం కోసం కలలు కన్నవారి ధైర్యాన్ని, కృషిని స్మరించుకోవాల్సి ఉంది… వారు కలలుగన్న భారత్ను నిర్మిద్దాం. ఈ ఏడాది ఆజాదీకా అమృత మహోత్సవ్ వేడుకల్లో భాగంగా వచ్చే నెల 13 నుంచి 15 మధ్య, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం’’ అనిమోదీ అన్నారు. దేశ తొలి ప్రధాని .జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆయన జత చేశారు.
https://twitter.com/narendramodi/status/1550315911886012416?s=20&t=fMe29SPXpAy4-ule4SqdHA