ఈసారి ఓబీసీలు ఎటువైపు అని చెప్పలేని పరిస్థితి. కీలక ఓటు బ్యాంకుగా ఉన్న వారు బీజేపీతోనే ఉంటూ వస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికలు మొదలు, తరువాత వచ్చిన అన్ని ఎన్నికల్లో కమలం పార్టీకి అండగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓబీసీల కీలక నాయకుడు స్వామిప్రసాద్ మౌర్య హఠాత్తుగా ఎస్పీ శిబిరంలో చేరిపోయారు. అంతకుముందు బీఎస్పీకి మద్దతుగా ఉండి 2012లో ఆపార్టీని అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు. ఎన్నికల ముందు ఆయన్ని పార్టీలో చేర్చుకున్న అఖిలేష్ చాలా ఆశలే పెట్టుకున్నారు. సుహల్ దేవ్, ఓంప్రకాశ్ రాజ్ భర్ వంటి కేబినెట్ మంత్రులూ కాషాయపార్టీకి బైబై చెప్పి అఖిలేష్ చేయందుకున్నారు. అటు రైతులు, జాట్లు, బ్రాహ్మణ వర్గాలతో పాటు యాదవులు, ముస్లింలూ బీజేపీ పట్ల నిరసనగా ఉన్నారని.. అది తమకు లాభిస్తుందని ఎస్పీ అంచనా వేసింది. అయితే అన్ని అంచనాలు తలకిందులు చేస్తూ ఆయా వర్గాలతో పాటు ఓబీసీలు బీజేపీవైపే గట్టిగా నిలిచారు. ఓట్ల వరదపారించి రెండోసారీ యోగీకే పాలనా పగ్గాలు అప్పగించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)