శ్రధ్దాను రాక్షసంగా పొట్టనపెట్టుకున్న ఆఫ్తాబ్ కు డిల్లీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఇప్పటికే విధించిన కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు మరికొంతకాలం రిమాండ్ కోరారు. ఆఫ్తాబ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుంచారు. పోలీసులు పదిరోజుల కస్టడీ కోరగా…ఐదురోజుల రిమాండ్ కు అప్పగించింది కోర్టు. అలాగే నార్కొ అనాలసిస్ టెస్టులకు కూడా కోర్టు అనుమతించింది.
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్ మే 18న శ్రద్ధాను చంపేశాడు. మరునాడు ఆమె బాడీని 35 ముక్కలుగా నరికేశాడు. సులభంగా కోసే అవకాశం ఉంటుందని భావించి శవంమీద వేడి నీళ్లు పోసినట్టు అంగీకరించాడు. 35 ముక్కల్ని మొత్తం 18 కవర్లలో ప్యాక్ చేశాడు. రోజుకో ప్యాక్ ను ఒక్కో ప్రాంతంలో పడేశాడు. నవంబర్ 11న శ్రద్ధాతండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆప్తాబ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలోనేరం అంగీకరించాడు.
ఇక ఇప్పటివరకు 13 ఎముకలను పోలీసులు మెహ్రౌలీ అటవీ ప్రాంతంనుంచి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టులకు వాటిని పంపారు. ఇప్పటివరకు కీలక ఆధారం మాత్రం పోలీసులకు లభించలేదు. అటు ఇంతటి ఘాతుకానికి తెగబడిన ఆఫ్తాబ్ ను ఉరితీయాలంటూ లాయర్లు సాకేత్ కోర్టు ఎదుట నినాదాలు చేశారు.
https://twitter.com/ANI/status/1593200533065826304?s=20&t=_D0JTmotBrL0PNrgR6E2Mg