‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి’’ అని హిందువులను బెదిరించిన రాజ్ కోట్ కు చెందిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ మోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Sohil Hussain Mor, advocate from Rajkot
ఛత్రపతి శివాజీ మహరాజ్ను కించపరుస్తూ ఆదివారం వాట్సాప్ గ్రూప్లో ఓ పోస్ట్ పెట్టడంతో పాటు… తమ మతపరమైన విశ్వాసాల్ని గాయపరచే వ్యాఖ్యలు చేసినట్టు పలువురు ఫిర్యాదు చేశారు. గొడవను అడ్డుకోబోయిన ఓ పోలీసుపైనా దాడి చేయడంతో వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. గుజరాత్లోని రాజ్కోట్, శ్యామాప్రసాద్ ముఖర్జీ నగర్ ఆవాస్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ రెసిడెన్షియల్ సొసైటీ ఓ వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ను కించపరుస్తూ సోహిల్ హుస్సేన్ ఈ గ్రూపులో ఓ పోస్ట్ పెట్టారు. దానిపై జ్యోతి సోధా అనే మహిళ ….సోహిల్కు ఫోన్ చేసి, తన అభ్యంతరాలను తెలిపారు. దీంతో రెచ్చిపోయిన సోహిల్ బయటకు వచ్చి గొడవకు దిగాడు.‘‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నవారంతా ముస్లింలే. హిందువులంతా వెళ్ళిపోవాలి’’ అని గర్జించాడు. అందుకు జ్యోతి ప్రతిస్పందిస్తూ ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, ఆయన మరింత రెచ్చిపోయి, ఆగ్రహంతో ఊగిపోతూ, ‘‘అదంతే, ఇక వెళ్ళిపో’’ అని అన్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు. నచ్చజెప్పబోయిన పోలీసులమీదా సోహైల్ దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా గణేశుని విగ్రహాన్ని పగులగొట్టాడు.
ఈ సొసైటీని పూర్తిగా పాకిస్థాన్గా మార్చేస్తామని, హిందువులంతా వెళ్ళిపోవాలని తన వెనక పెద్ద శక్తులున్నాయని తరచూ బెదిరిస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)