తెలంగాణలో న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన లాసెట్, పీజీసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. జూలై 21, 22 తేదీల్లో జరిగిన లాసెట్, పీజీసెట్ పరీక్షలకు 35, 538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 28,921 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.