‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్
నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు సాగుతుంది. ముఖ్యంగా పురాణపురుషుడు శ్రీరాముని జీవితానికి సంబంధం ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలను ఈ రైల్లో చుట్టేస్తుంది. రామాయణ విశేషాల్ని ప్రదర్శిస్తూ అద్భుత కళాఖండంగా రైలు లోపలా తీర్చిదిద్దారు. శ్రీరామాయణ యాత్రకు పలు రకాల ప్యాకేజీలు సిద్ధంగా ఉన్నాయి. మొదటి షెడ్యూల్ నవంబర్ 7న ప్రారంభమవగా.. రెండో పర్యటన నవంబర్ 16న , మూడో రైలు పర్యటన నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది.
1. అయోధ్య- శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ దేవాలయం, నందిగ్రామ్లోని భారత మందిరం.
2. బీహార్- సీతామర్హి, రామ్ – జాంకీ ఆలయం.
3. వారణాసి- ప్రయాగ, చిత్రకూట్, శృంగవర్పూర్లోని ఆలయాలు.
4. నాసిక్- త్రయంబకేశ్వరాలయం, పంచవటి.
5. హంపి- కృష్కింధ నగరం.
6. రామేశ్వరం- పర్యటన చివరి గమ్యస్థానం.
భారత ప్రభుత్వం ద్వారా ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమం కింద IRCTC ఈ ప్రత్యేక తీర్థయాత్ర రైలును ప్రారంభించింది. హోటల్లలో వసతి, భోజనం , ఆయా క్షేత్రాల్లో తిరిగేందుకు వాహనఖర్చు, ప్రయాణ బీమా, ఆరోగ్యసేవలు సహా …సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రయాణం అందించడమే లక్ష్యమని రైల్వే అంటోంది.
నవంబర్ 16 నుండి ప్రారంభమయ్యే శ్రీ రామాయణ యాత్ర- మధురై రైలు ప్రయాణం 12 దినాలు, 13 రాత్రులు కాగా…నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే శ్రీగంగానగర్ రైలు 16 రాత్రులు, 17 దినాలు ఉంటుంది.