కరోనా బారిన పడిన ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కోలుకుంటున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని…మహారాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. ఈనెల 8న కరోనాబారిన పడిన ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్చారు. ఒక దశలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. డాక్టర్ ప్రతీత్ నందానీ నేతృత్వంలోని బృందం ఆమెకు చికిత్స అందించింది. క్రమంగా ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని… ఆమెకు వెంటిలేటర్ కూడా తొలగించామని..కేవలం ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే ఆమె పూర్తిగా నార్మల్ అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందంటున్నారు.