ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 92 ఏళ్ల లతాజీ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమాన లోకం ఆందోళన చెందుతోంది. లతాజీ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. లతాజీకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. కొన్ని లక్షణాలు ఉండడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్పించినట్టు లతా మేనకోడలు రచనా తెలిపారు. ముందుజాగ్రత్తగా ఆమెను ఐసీయూలో చేర్చారని….ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. 2019లో కూడా లతా వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు.