Matalaiజమ్ముకశ్మీర్లో అతిపెద్ద యోగా కేంద్రాన్ని నిర్మిస్తోంది కేంద్రం. ఉధంపూర్లోని మంటలైలో 2017లో నిర్మాణపనులు ప్రారంభమైనా కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్మాణపనులు కాస్త ఆగిపోయాయి. అసలైతే 36 నెలల్లో పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రం పనులు 90శాతంపైగా పూర్తయ్యాయి.
అంతర్జాతీయ యోగా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. హిమాలయాల్లో సాల్ అడవుల ఒడిలో తావి నది తీరంలో మండలై గ్రామం ఉంది. ఈ కేంద్రం పూర్తయ్యాక…ఉధంపూర్లో పర్యాటకానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ ఊతంగా మారుతుందన్నారు. యోగా సెంటర్ పెద్ద పిరమిడ్ ఆకారంలో ధ్యానమందిరం నిర్మించారు. అక్కడ యోగాతో పాటు ద్యానం చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, బిజినెస్ కన్వెన్షన్ సెంటర్, హెలిపాడ్, స్పా, కెఫెటేరియా, డైనింగ్ హాల్, కాటేజ్ డిజైన్ ఎకో లాడ్జ్, మెడికల్ ఎన్ క్లేవ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.