రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. రాజధాని భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్బండ్ చెంత ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోనే అతిఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, స్మృతివనాన్ని తీర్చిదుద్దుతామని 2016లో ఆయన జయంతి సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఆయన మార్గదర్శకాలమేరకు 2023 ఏప్రిల్ 30 కంటే ముందుగానే పనులు పూర్తయ్యాయి.
ఓ ఆదర్శమూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉందని తన జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. బాబా సాహెబ్ బాటలో ఈ దేశాన్ని సరైన దారిలో పెట్టేందుకు చివరి రక్తపు బొట్టువరకు పోరాడుతానని కేసీఆర్ అన్నారు.
https://twitter.com/BRSparty/status/1646836995006828544?s=20