సరిహద్దునుంచి దేశంలోకి మాదకద్రవ్యాల రవాణా అక్రమరవాణా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ నుంచి తరలిస్తున్న కోట్లరూపాయల విలువైన హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరం గుండా పెద్దమొత్తంలో మాదకపదార్థం భారత జలాల్లోకి చేరిందన్న సమాచారం అధికారులకు అందింది. అప్రమత్తమైన వారు పాకిస్తాన్ ఫిప్పింగ్ బోటులో ఉన్న 280 కోట్ల విలువైన నిషేధిత హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. తొమ్మిది మంది సిబ్బందినీ అదుపులోకి తీసుకున్నారు. అరేబియా సముద్రం మీదుగా పెద్దఎత్తున హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితమే నిఘావర్గాలు సమాచారం ఇవ్వడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ బృందాలు అప్రమత్తమయ్యాయి. రాత్రి సంయుక్త ఆపరేషన్ నిర్వహించగా పాకిస్తాన్ నుంచి వస్తున్న అల్ హజ్ పడవను తనిఖీ చేయగా పెద్దమొత్తంలో హెరాయిన్ బయటపడింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)