కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ గణపతుల చిత్రాలు ఉంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. కొత్త నోట్లపై ఓ వైపు మహాత్మాగాంధీ, మరోవైపు దేవుళ్ల చిత్రాలు ముద్రించాలని సూచించారు. మనం ఎంత చేసినా దైవబలం లేకుంటే నిష్ప్రయోజమని దేవీదేవుళ్ల చిత్రాలు ఉంచితే దేశం మరింత ముందుకు సాగుతుందని అన్నారు కేజ్రీ. ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాలో వాళ్ల కరెన్సీపై గణేశుడి రూపం ఉంటుందని..అలాంటిది మనం ఎందుకు అలా చేయకూడదనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిల్లీ సీఎం. ఈ విషయంపైనే ప్రధానికి లేఖ రాస్తానన్నారు. అయితే కేజ్రీవాల్ తాజా విజ్ఞప్తిపై బీజేపీ స్పందించింది. కేజ్రీవాల్ కొత్తముసుగు ధరించారని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. రామమందిరాన్ని వ్యతిరేకించిన…కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసలు అబద్దమని వాదించిన కేజ్రీవాల్, ఆప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు.