రాష్ట్రంలో పలుపట్టణాలు, నగరాలకు పూర్వపు పేర్లు మారుస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధాని పేరు మార్చబోతున్నారా?ఆయన తాజా ట్వీట్ ఊహాగానాలకు బలమిస్తోంది.
ఇప్పటికే అలహాబాద్ సహా పలునగరాల పేర్లను అధికారికంగా మార్చింది యోగీ సర్కార్. సర్కార్ అనేక పాత పేర్ల స్థానే కొత్త పేర్లు మార్చుకుంటూ వెళ్తోంది. ఇప్పుడిక లక్నో పేరును కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
शेषावतार भगवान श्री लक्ष्मण जी की पावन नगरी लखनऊ में आपका हार्दिक स्वागत व अभिनंदन… pic.twitter.com/zpEmxzS3OE
— Yogi Adityanath (@myogiadityanath) May 16, 2022
ఒకరోజు నేపాల్ పర్యటన ముగించుకుని లక్నో వచ్చిన ప్రధానికి స్వాగతం పలుకుతూ ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ”శేషావతార్ భగవాన్ లక్ష్మణ్ కీ పావన్ నగరి లక్నో మే ఆప్కా స్వాగత్ ఔర్ అభినందన్” అంటూ హిందీలో యోగి ట్వీట్ చేశారు. శేషావతారుడైన లక్ష్మణుడి పావన నగరం లక్నో మీకు స్వాగతం పలుకుతోందని అర్థం. దీంతో లక్నో పేరును లక్ష్మణ్పురి గా మార్చునున్నారనేచర్చ నడుస్తోంది. లక్ష్మణుడి భవ్యమందిర నిర్మాణం అక్కడ జరుగుతోంది కూడా. దీంతో లక్నో పేరును లక్ష్మణ్పురిగా కానీ లఖన్పురిగా మార్చే అవకాశాలున్నాయంటున్నారు.