యూపీ లఖింపూర్ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గతేడాది అక్టోబర్ 3న ఆశిష్ వేగంగా కారు నడపి నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణానికి కారణమయ్యాడు. ఈ కేసులో అక్టోబరు 9న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతనికి బెయిల్ రావడంపై బాధిత రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని వారు వాపోయారు. మంత్రి కుమారుడు కావడం వల్లనే అతనికి బెయిల్ ఇచ్చారని…బీజేపీ సర్కారుపై పూర్తిగా నమ్మకం పోయిందని వారంటున్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన అతను దోషి కాకుండా పోడని… న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని అదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు రమణ్ కాశ్యప్ సోదరుడు అమన్ కాశ్యప్ అన్నారు.