ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డాను నియమించబోతున్నారు. ఇప్పటికే ఈయన నియామకానికి సంబంధించిన కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ఇంటిలిజెన్స్ చీఫ్ కనులు, చెవులు మాదిరిగా పనిచేస్తారు. ఈ టీం నుంచి వచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు పనితీరుని మార్చుకుంటూ వెళ్తాయి. రాష్ట్రంలోని ఐపీఎస్ లందరూ హోంమంత్రికి రిపోర్ట్ చేస్తారు కానీ డిజిపితో పాటు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ మాత్రమే నేరుగా సీఎం కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇంటిలిజెన్స్ చీఫ్ నివేదికలకు ప్రభుత్వం లోను పార్టీలోను చాలా ప్రాధాన్యం ఉంటుంది.
కానీ దురదృష్టం ఏమిటంటే గడచిన రెండు ప్రభుత్వాల్లోనూ ఇంటిలిజెన్స్ చీఫ్ లు.. మరి ముఖ్యమంత్రి సొంత మనుషుల్లా మారిపోయారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఐబి వెంకటేశ్వరరావుకి చాలా ప్రాధాన్యం ఉండేది. ప్రభుత్వం చివరి రోజుల్లో అయితే ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితులు కొనసాగాయి. గ్యారెంటీగా మనమే నెగ్గిస్తున్నామంటూ ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి నివేదికలకు తెప్పించి బాబు గారికి ఇప్పించి, , చివరకు పార్టీని ఇంటికి పంపించారు అని టిడిపి నాయకులు లో లోపల గొణుక్కుంటూ ఉంటారు.
ఇక నిన్నటి వైసిపి ప్రభుత్వం లో అయితే మరీ దారుణం. ఇంటెలిజెన్స్ పోలీసులు పోటీపడి మరి నివేదికలు సమర్పిస్తూ వచ్చారు. వై నాట్ 175 అంటూ జగన్ హడావిడి చేయడానికి సగం కారణం ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన అత్యుత్సాహపు నివేదికే అని చెబుతుంటారు. ఇంటెలిజెన్స్ భాస్కర్ వ్యవహరించిన సీతారామాంజనేయులు ఉదయం లేచిన దగ్గర్నుంచి సీఎం ఫేషీ లోనే కాలక్షేపం చేసేవారు అని టాక్. జగన్ దగ్గర ప్రశంసలు పొందేందుకు,, 150 సీట్లు పైగా గెలుస్తున్నామంటూ ఇంటెలిజెన్స్ పోలీసులు ఊదర కొట్టేశారు అని టాక్. ఐపాక్ టీం,, ఇంటెలిజెన్స్ పోలీసులు పోటీ పడుతూ ఇచ్చిన నివేదికలతో.. జగన్ పరిస్థితి 11 సీట్లకు వచ్చేసింది.
ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నియామకాల విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. భజన బ్యాచ్ ను దూరం పెట్టి సమర్థుల్ని ఎన్నుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పవర్ ఫుల్ అధికారిగా పేరు తెచ్చుకున్న ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించారు. సమర్థత సీనియార్టీ సిన్సియారిటీ కలబోసిన అధికారిగా ద్వారకా తిరుమల ని చెబుతారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ విషయంలో కూడా అలాగే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముక్కు సూటి అధికారిగా పేరు తెచ్చుకున్న మహేష్ చంద్ర లడ్డాను ఇంటెలిజెన్స్ బాస్ గా తీసుకోబోతున్నారు.
ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. ఆయన 1998 ఏపీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్.
ఐపీఎస్ చంద్ర లడ్డాను ఏపీ సర్వీస్లోకి పంపించాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా సీఎం చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరు ఉంది. లా అండ్ ఆర్డర్లో ఆయన రాజీ పడరు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు అనే పేరు కూడా ఆయన సొంతం. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన కోడి కత్తి ఘటనలో విశాఖ సిటీ పోలీసు కమిషనర్గా చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారు.
రాజస్థాన్కు చెందిన మహేష్చంద్ర లడ్డా నేరుగా ఐపీఎస్కు ఎంపికయ్యారు. 1998 ఏపీ బ్యాచ్కు చెందిన ఆయన, విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు. గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమే కాదు, క్లబ్లపై దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్గా పని చేశారు.
గతంలో జరిగిన తప్పులు దొర్లకుండా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నార అందుకే సమర్థత గల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.