ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ తిరుపతిలోని స్వగృహంలో కన్నుమూశారు. వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 1978 లో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా 1985,1989,1999, 2004 ఎన్నికలలో వేపంజేరి నియోజకవర్గం నుంచి, 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.1994లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగి ఓడిపోయారు. తరువాత 2014లో టీడీపీ నుంచి గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1992-1993 మధ్య కాలంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి మంత్రి వర్గం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా పనిచేసిన కుతూహలమ్మ …2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.