చిత్తూరు జిల్లా కుప్పంలో వారంరోజులుగా బీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ రెండు ఏనుగులు తిరుపత్తూరు సమీపంలోని పొలాల నుంచి తప్పించుకోజూశాయి. స్థానికులు ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రత్యేక బృందంతో కలసి మత్తు మందు ఇచ్చారు. ఒకటి మత్తులోకి జారుకోగా మరొకటి తప్పించుకుంది. తప్పించుకున్న ఏనుగునూ అధికారులు పట్టుకున్నారు. బీభత్సం సృష్టించి ప్రాణాలు సైతంబలిగొన్న ఏనుగులను బంధించడంతో కుప్పం వాసులు ఊపిరి పీల్చుకున్నారు.