పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుని వెళ్తున్న బిజెపి మీద బురద జల్లేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేస్తారని, పార్లమెంట్లో బీఆర్ఎస్ కు పట్టు లేకపోతే ఇది జరిగిపోతుందని హెచ్చరించారు. వచ్చే జూన్ నెల 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాల నిండుతాయని, అప్పటిదాకా హైదరాబాదు ఉమ్మడి రాజధాని గా ఉంటుందని గుర్తు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ మీద ఎటువంటి చట్టమైన చేసే వీలు ఉంది కాబట్టి కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ప్రభుత్వం జరుగుతుంది అని
కేటీఆర్ ఆరోపించారు.
నిజానికి ఈ ఆరోపణ పూర్తిగా సత్య దూరం అని అనుకోవాలి. ఎందుకంటే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఇటు హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ వాసులు గాని అనుకోవడం లేదు. విభజన సమయంలో కొంతమంది ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఈ డిమాండ్ చేశారు తప్పితే ఇప్పుడు ఏపీలో కూడా ఈ విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. అటువంటి అప్పుడు కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేపట్టదు. కేంద్ర పాలిత ప్రాంతం చేయడం వల్ల తెలంగాణలో ఓట్లు మొత్తం పోతాయి, కొత్తగా ఎక్కడా సీట్లు రానే రావు. అటువంటి అప్పుడు కాంగ్రెస్ కానీ బిజెపి కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయదుగాక చేయదం. ఈ విషయాలన్నీ కేటీఆర్ కు కూడా తెలుసు , కానీ ఎన్నికల సమయంలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సహజం కాబట్టి ఆయన ఈ మార్గం ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు.