తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. ఈ టూర్ లో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి వారికి వివరించనున్నారు. 13వ తేదీ వరకు కేటీఆర్ యూకేలో పర్యటిస్తారు.
గతేడాది మేలో కూడా కేటీఆర్ లండన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. భారత హైకమిషన్ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు.