ఎన్నికల సమయంలో ముస్లిం, క్రైస్తవ ఓట్ల కోసం హైందవ దేవీ దేవతలని కొంతమంది అదే పనిగా దూషిస్తున్నారు. రాముడు చిన్నాన్న అవుతాడా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఇటీవల నోరు పారేసుకున్నారు. దీని మీద పెద్ద దుమారం రేగినప్పటికీ కూడా అద్దంకి దయాకర్ కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ ఎక్కడా తగ్గలేదు కనీసం,, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడలేదు.
మరోవైపు జైశ్రీరామ్ అనే పదం ఏమైనా అన్నం పెడుతుందా అని తెలంగాణ మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హేళనగా మాట్లాడారు. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల మీద నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు.
హనుమాన్ చాలీసా పాడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.
బీ ఆర్ ఎస్ కి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ లోగా పోలీసులు కలగ చేసుకొని, హనుమాన్ దీక్షాపరులను అక్కడ నుంచి పంపించివేశారు.
కానీ ఓట్ల కోసం ఈ మాదిరిగా దేవి దేవతలని దూషించడం మాత్రం ఏ మాత్రం సరికాదు. లౌకిక పార్టీల అన్న ముసుగులో కేవలం హిందూ మతాన్ని, దేవీ దేవతలని మాత్రమే అవమానిస్తున్నారు.