ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎఎస్ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి ఆ బాధ్యతల్లో ఉంటారు. 2024 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ఉంటారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను నియమించారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పూనం మాలకొండయ్య, నీరబ్ కుమార్, కరికాల్ వలెననే జవహర్ రెడ్డికన్నా సర్వీసులో సీనియర్లే అయినా జగన్ మాత్రం జవహర్ రెడ్డివైపే మొగ్గుచూపారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.