\గుజరాత్ లో రాజకీయం వేడెక్కింది.అధికార పార్టీ బీజేపీతో పాటు ఆప్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం కూడా మొదలైంది. ఇక సొంత రాష్ట్రంలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
అయితే కేజ్రీవాల్ హిందూ ద్రోహి అంటూ రాష్ట్రంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. దానిపై ఘాటుగానే స్పందించారు డిల్లీ సీఎం. గుజరాత్ లో అరాచకాలకు పాల్పడుతున్న కంసుని వారసులను అంతమొందించేందుకు శ్రీకృష్ణుడే తనను పంపాడనీ అన్నారు. వల్సాద్ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓడిపోవాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే కోరుకుంటున్నారనీ అన్నారు కేజ్రీవాల్. పంజాబ్లో ఇటీవలే అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆప్ గుజరాత్ పైనా సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా పలు ఉచిత హామీలూ ఇస్తున్నారు కేజ్రీవాల్. రైతులకు, గృహవినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తోంది ఆప్.