హిందువుల ఆరాధ్యదైవం కృష్ణుడి జన్మస్థలమైన మధురలోని షాహీ ఈద్గా మసీదును కృష్ణ జన్మభూమిగా గుర్తించాలని కోరుతూ లాయర్ మహేక్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 17న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిటిషనర్ మహేశ్వరి సహా అతని లాయర్ విచారణ సమయంలో గైర్హాజరైనందున జనవరి 19, 2021న కొట్టివేసిన పిటిషన్ను హైకోర్టు పునరుద్ధరించింది. కొట్టివేసిన వెంటనే దాఖలు చేసిన పిటిషన్ పునరుద్ధరణ దరఖాస్తుపై స్పందించిన అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు కృష్ణ జన్మభూమి కేసును మళ్లీ విచారించాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ సహా జస్టిస్ ప్రకాష్ కపాడియాలతో కూడిన ఇద్దరు సభ్యుల డివిజనల్ బెంచ్ కొట్టివేసిన పిటిషన్ను పునరుద్ధరించడానికి ఫిబ్రవరి 17, 2022 న ఉత్తర్వును ఆమోదించింది. కృష్ణ జన్మభూమి కేసు ఈ ఏడాది జూలై 25న విచారణకు రానుంది.
ఈ సమస్య 1968లో శ్రీ కృష్ణజన్మస్థాన్ సేవా సంఘ్ వారు మసీదు ఈద్గా ట్రస్ట్ నిర్వహణ కమిటీకి దేవుడికి చెందిన అతి ముఖ్యమైన భూభాగాన్ని అప్పగించినప్పటి నుండి కృష్ణ జన్మభూమి వివాదాస్పదంగా మిగిలిపోయింది.
అప్పటి చర్యను సవాలు చేస్తూ, “ట్రస్ట్ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ 12.10.1968న సొసైటీ శ్రీ కృష్ణ జనమస్థాన్ సేవా సంఘ్తో చట్టవిరుద్ధంగా రాజీ కుదుర్చుకుంది.. ఇద్దరూ న్యాయస్థానాన్ని మోసం చేశారు. నిజానికి శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్ 1958 నుండి పనిచేయడం లేదని” పిటిషన్ పేర్కొంది.
మధుర జిల్లా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కూడా కృష్ణ జన్మభూమి కూల్చివేత తర్వాత షాహీ ఈద్గా మసీదు నిర్మించబడినట్లు ఉందని మహేక్ తెలిపారు. చెక్కిన స్తంభాలు, పురాతన వస్తువులు వంటి కొన్ని నిర్మాణ అంశాలు మసీదు ప్రాంగణంలో కనుగొనబడ్డాయని.. వాటిని కొంతమంది కార్మికులు రికార్డ్ చేశారని పిటిషనర్ తెలిపారు.
మసీదును నిర్మించడం ఇస్లాంలో ముఖ్యమైన మతపరమైన ఆచారంగా పరిగణించబడదు కాబట్టి, ఆర్టికల్ 25 ప్రకారం మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి, ప్రచారం చేయడానికి హిందువులకు హక్కు ఉన్నందున వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించాలని న్యాయవాది మహేక్ మహేశ్వరి పిటిషన్లో కోరారు.
https://twitter.com/MehekMaheshwari/status/1502087997285535748?s=20&t=PnOQ7W_1TbRR_b_UwPeGKg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)