ఇక వదిలింది అని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ తరుముతోంది మాయదారి కరోనా. కొవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ (variant XE) ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఎక్స్ఈ వేరియంట్ కేసులు వెల్లువలా వస్తున్నక్రమంలో…భారత్ ను తాకింది. తొలి కేసును ముంబైలో గుర్తించారు. మొత్తం 376 అనుమానిత శాంపిళ్లను పరీక్షించగా, అందులో ఒకటి XE variant పాజిటివ్ గా తేలినట్లు వెల్లడైంది. ఒమిక్రాన్ వేరియంట్ లో ఒకానొక మ్యూటెంగ్ గా కనుగొన్న ఎక్స్ఈని సరికొత్త వేరియంట్ గా గుర్తించడానికి అవసరమైన లక్షణాలన్నీ ఉన్నట్లు వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ.. అన్ని దేశాలను గత వారమే అప్రమత్తం చేసింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్10 శాతం వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకే తర్వాత యూఎస్ లోనూ ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే నమోదవుతుండడంతో ఆందోళన ఎక్కువైంది. ఈనేపథ్యంలో మనదేశంలోనూ కేసు వెలుగుచూడడం వణికిస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)