కోవాగ్జిన్ కు జైకొట్టిన బ్రెజిల్
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించడంపై కొన్ని ప్రతిపక్షాల నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీకి మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా వేళ మోడీ ప్రజాదరణ 75 శాతమని ఒక అమెరికన్ కంపెనీ సర్వేలో తేలింది. ఇప్పుడు బ్రెజిల్ ప్రభుత్వం 50 లక్షల డోసుల వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. బ్రెజిల్ ప్రభుత్వం స్వయంగా తన అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయం తెలిపింది.
వ్యాక్సిన్ విషయంలో ప్రతిపక్షాల నేతల విపరీత వ్యాఖ్యానాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. ఇంత కాలం మన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ వచ్చారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్ వచ్చినా మన దేశంలో ఆలస్యం ఎందుకు అన్నారు. ఇప్పుడు మన దేశీయ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమిస్తే అదేమిటని అదే పార్టీ నాయకులు కొందరు విచిత్రంగా వాదిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించ వద్దన్న బిజెపి నేతల హిత వచనాలు పనిచేస్తాయో లేదో. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షం వేలెత్తి చూపాలి. ఆ హక్కు ఉంది. కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై రాద్ధాంతం చేయడం బాధాకరం.