హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి కావడంతో పెద్దసంఖ్యలో ఆంజనేయ మాలధారులు కొండకు తరలివచ్చారు. అర్థరాత్రినుంచే దీక్ష విరమణలు మొదలయ్యాయి. నిన్న రాత్రి నుంచి లక్షమందికి పైగా స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. పెద్దఎత్తున భక్తులు వస్తుండడంతో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సింధుశర్మ, అడిషనల్ ఎస్పీ రూపేష్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.