ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని …నెలరోజుల ముందు అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన తరువాత ముందుకెళ్తానని అన్నారు.గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వెంకటరెడ్డి. వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిలపట్ల పోలీసుల తీరను ఆయన తప్పుపట్టారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వెంకటరెడ్డి పార్టీచీఫ్ రేవంత్ తో విభేదించి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొన్నటి మునుగోడు ఉపఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.