పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే సంక్షోభం చల్లారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను నియమించడం హర్షనీయమన్నారు. గాంధీభవన్లో ఉండే పైరవీకారులకే పదవులు ఇచ్చారన్న్ కోమటిరెడ్డి వాటిపై సమగ్ర విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే మునుగోడు ఎన్నికల సందర్భంగా తనను తిట్టినవారిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.