బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హాట్ గ్రామంలో 10 మందిని దారుణంగా చంపిన ఘటనపై కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై విచారణ చేపట్టింది. పోలీసు విచారణ సరిగా జరగలేదు అని అభిప్రాయ పడింది.
కలకత్తా హైకోర్టు కేంద్ర ఫోరెన్సిక్ లాబ్ ను స్పాట్ నుండి సాంపిల్స్ సేకరించి ఆలస్యం చేయకుండా పూర్తి పరీక్ష చేయమని ఆదేశించింది. జిల్లా జడ్జి సమక్షంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. CCTV కెమెరాల ఇన్స్టాలేషన్ను పర్యవేక్షించడానికి మరియు అన్ని కోణాలు కవర్ అయ్యేలా చూసేందుకు బీర్భమ్ జిల్లా న్యాయమూర్తి. సాక్షులకు తగిన రక్షణ కల్పించాలని, ఎవరూ బెదిరింపులకు గురికాకుండా లేదా ప్రభావితం కాకుండా చూసుకోవాలని జిల్లా జడ్జితో సంప్రదించి డిజి మరియు ఐజిపిలను కోర్టు కోరింది. ఇది కూడా, “ఇప్పటికే పోస్ట్మార్టం జరిగింది. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే, అది. కూడా వీడియోగ్రఫీ చేయాలి రేపు కోర్టు ముందు దాఖలు చేసే నివేదికలో అన్ని పోస్ట్మార్టమ్లకు వీడియోగ్రఫీ చేశారా లేదా అనేది తెలిసిపోతుంది అని పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన నివేదికను మార్చి 24 అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు సమర్పించాలి అని ఆదేశించింది.
అసలు జరిగింది ఏమిటంటే బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మరియు పంచాయతీ లెవెల్ నాయకుడు బహదూర్ షేక్ సోమవారం బాంబు దాడిలో మరణించాడు. దానికి ప్రతీకారం గా ఆ హత్య తర్వాత, మంగళవారం తెల్లవారుజామున రాంపూర్హాట్లో అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇందులో ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు మరియు ఇద్దరు పిల్లలుతో సహా ఎనిమిది మంది వ్యక్తులను ఇంట్లోంచి బయటకు రాకుండా తలుపులు వేసి ఇల్లు తగలబెట్టి చంపబడ్డారు.
అధికార పార్టీకి టీఎంసీ కి చెందిన రెండు వర్గాల మధ్య వైరం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు పేర్కొంటుండగా, గత ఏడాది జనవరిలో జరిగిన అతని తండ్రి హత్యతో ఈ హత్యకు కూడా సంబంధం ఉందని బదు షేక్ కుటుంబీకులు అంటున్నారు.
ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు చెపుతున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ (సిఐడి) జ్ఞానవంత్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
గత సం. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొదలైన విపరీతమైన హింస ఇంకా సద్దుమణగ కుండానే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా అంతులేని హింస చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ దుర్ఘటన…
బెంగాల్ చే జారి పోతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ బోర్డర్ జిల్లాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంఘటన కూడా బంగ్లాదేశ్ బోర్డర్ వైపు గల బిర్భుమ్ జిల్లాలోనే జరిగింది.
~ చాడా శాస్త్రి

(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)