తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పోవుడు, బీజేపీ వచ్చుడేనని అన్నారు. పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ‘బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతమని, నరేంద్ర మోదీని దేశం నుంచి తరిమి కొడ్తమని కేసీఆర్ అంటున్నరు. బీజేపీని ఢీ కొట్టడానికి నువ్వెంత.. నీ కుటుంబం ఎంత?” అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ఇప్పటికి 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని…వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కాషాయజెండా ఎగరడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. మోదీ పరిపాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను రాష్ట్రంలోనూ గెలిపిస్తాయన్న కిషన్ రెడ్డి… ప్రపంచంలోనే సచివాలయం లేని ఏకైక రాష్ట్రం బహుషా తెలంగాణ ఒక్కటేనని ఎద్దేవా చేశారు.
రానున్నది తమ పార్టీనేనని కేసీఆర్ ను జైలుకు పంపేది ఖాయమని బండిసంజయ్ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా సంజయ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి-కిషన్ రెడ్డి
రానున్నది తమ పార్టీనేనని కేసీఆర్ ను జైలుకు పంపేది ఖాయమని బండిసంజయ్ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా సంజయ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
Share: